CBN: దేశం గర్వపడేలా అమరావతి నిర్మిస్తాం

CBN: దేశం గర్వపడేలా అమరావతి నిర్మిస్తాం
X
2028 మార్చి నాటికి అమరావతి పనులు పూర్తి.. బ్యాంకుల కార్యాలయాల శంకుస్థాపనలో సీఎం.. రైతులు స్వచ్ఛందంగా భూమలు ఇచ్చారన్న సీఎం

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ రా­జ­ధా­ని అమ­రా­వ­తి ని­ర్మా­ణా­ని­కి రై­తు­లు స్వ­చ్ఛం­దం­గా ముం­దు­కొ­చ్చి భూ­ము­లు ఇచ్చా­ర­ని , ఈ సం­ద­ర్భం­గా రై­తు­ల­కు సీఎం చం­ద్ర­బా­బు ధన్య­వా­దా­లు తె­లి­పా­రు. అమ­రా­వ­తి­లో 15 బ్యాం­కు­ల­కు, ప్ర­భు­త్వ­రంగ సం­స్థల ప్ర­ధాన కా­ర్యా­ల­యాల ని­ర్మా­ణా­ని­కి కేం­ద్ర ఆర్థిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌ శు­క్ర­వా­రం శం­కు­స్థా­పన చే­శా­రు. అనం­త­రం ఏర్పా­టు­చే­సిన సమా­వే­శం­లో సీఎం చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ.. ప్ర­పం­చం­లో­నే ఈ తర­హా­లో ల్యాం­డ్‌­పూ­లిం­గ్‌ జరి­గిన ఏకైక ప్రాం­తం అమ­రా­వ­తి అన్నా­రు. కేం­ద్ర­మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్, సీఎం చం­ద్ర­బా­బు, డి­ప్యూ­టీ సీఎం పవన్ కళ్యా­ణ్ సహా పలు­వు­రు హా­జ­ర­య్యా­రు. 15 సం­స్థల ప్ర­ధాన కా­ర్యా­ల­యాల ని­ర్మా­ణా­ని­కి శ్రీ­కా­రం చు­ట్టా­రు. అమ­రా­వ­తి­ని స్ఫూ­ర్తి­గా తీ­సు­కుం­టా­ర­ని ప్ర­శం­సిం­చా­రు. 2028 నా­టి­కి ని­ర్మా­ణా­లు పూ­ర్తి చేసి, దే­శా­ని­కి గర్వ­కా­ర­ణం­గా తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని చం­ద్ర­బా­బు ధీమా వ్య­క్తం చే­శా­రు. . ప్ర­పం­చం­లో స్ఫూ­ర్తి­దా­య­క­మైన ల్యాం­డ్ పూ­లిం­గ్ వి­ధా­నం­లో భూ­ముల పొం­దిన ప్రాం­తం అమ­రా­వ­త­ని.. రూ.15 వేల కో­ట్ల­ను రా­జ­ధా­ని పు­న­ర్ని­ర్మా­ణా­ని­కి కే­టా­యిం­చా­మ­న్నా­రు. రూ.1,334 కో­ట్ల­తో బ్యాం­కు­లు, బీమా కం­పె­నీల ప్ర­ధాన కా­ర్యా­ల­యా­లు ఏర్పా­టు చే­య­డం ఆనం­దం­గా ఉం­ద­న్నా­రు. బ్యాం­కు­లు, బీమా కం­పె­నీల ఏర్పా­టు­తో 6,556 మం­ది­కి ఉద్యో­గా­లు కూడా వస్తా­య­న్నా­రు. ఫై­నా­న్షి­య­ల్ డి­స్ట్రి­క్ట్ పే­రిట బ్యాం­కు­లు, ఆర్ధిక సం­స్థల కోసం అమ­రా­వ­తి­లో స్థ­లం కే­టా­యిం­చి­న­ట్లు తె­లి­పా­రు. ‘అమ­రా­వ­తి పను­లు ఊపం­దు­కు­న్న సమ­యం­లో 2019లో వై­సీ­పీ అధి­కా­రం­లో­కి వచ్చిం­ది. దాం­తో అయి­దే­ళ్ల పా­ల­న­లో రా­ష్ట్రం­లో వి­ధ్వం­సం జరి­గిం­ది. వెం­టి­లే­ట­ర్‌­పై ఉన్న రా­ష్ట్ర ఆర్థిక వ్య­వ­స్థ­ను గా­డిన పె­ట్టిన ఘనత కేం­ద్రా­ని­దే.” అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

పోలవరం ప్రాజెక్టుకు సహకరించాలి: చంద్రబాబు

సము­ద్రం­లో కలి­సే మి­గు­లు జలా­లు వా­డు­కు­ని దే­శా­ని­కి ఆర్థిక తో­డ్పా­టు ఇచ్చే పో­ల­వ­రం అను­సం­ధాన ప్రా­జె­క్టు­కు సహ­క­రిం­చా­ల­ని ని­ర్మ­లా­సీ­తా­రా­మ­న్‌­ను ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు కో­రా­రు. రా­య­ల­సీ­మ­ను హా­ర్టీ­క­ల్చ­ర్ హబ్‌­గా అభి­వృ­ద్ధి చే­సేం­దు­కు సహ­క­రిం­చా­ల­ని సూ­చిం­చా­రు. పూ­ర్వో­దయ ప్రా­జె­క్టు ద్వా­రా ఉత్త­రాం­ధ్ర­కు ఎంతో మేలు జరి­గే అవ­కా­శం ఉం­ద­ని.. అం­దు­కు తగిన సహా­యం అం­దిం­చా­ల­ని వి­న్న­విం­చా­రు. రా­జ­ధా­ని రై­తు­ల­కు క్యా­పి­ట­ల్ గె­యి­న్స్ మి­న­హా­యిం­పు మరో రెం­డే­ళ్లు పొ­డి­గిం­చా­ల­ని ని­ర్మ­లా­సీ­తా­రా­మ­న్‌­కు వి­జ్ఞ­ప్తి చే­శా­రు. అమ­రా­వ­తి అన్‌­స్టా­ప­బు­ల్‌­గా దూ­సు­కె­ళ్లేం­దు­కు కేం­ద్ర­ప్ర­భు­త్వం అన్ని వి­ధా­లా సహ­క­రిం­చా­ల­ని కో­రా­రు. రా­బో­యే ఐదే­ళ్లు కేం­ద్రం రా­ష్ట్రా­ని­కి సహ­క­రి­స్తే ని­ల­దొ­క్కు­కో­వ­టం­తో పాటు దేశ ఆర్థిక ప్ర­గ­తి­కి వె­న్ను­ము­క­గా ని­లు­స్తా­మ­ని చె­ప్పు­కొ­చ్చా­రు. కేం­ద్ర సహ­కా­రం­తో­నే అమ­రా­వ­తి పను­లు శర­వే­గం­గా జరు­గు­తు­న్నా­య­న్నా­రు.






Tags

Next Story