ఉద్రిక్తకు దారి తీసిన 'చలో అమలాపురం' కార్యక్రమం

X
'చలో అమలాపురం' కార్యక్రమానికి ఆంక్షలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్యామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ అడ్డుకోవడం దారుణమని మండిపడుతున్నారు నేతలు. ఎన్ని ఆంక్షలు పెట్టినా 'చలో అమలాపురం' చేపట్టి తీరతామని అంటున్నారు. ఐతే.. పోలీసులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఎవర్నీ అనుమతించేది లేదని చెప్తున్నారు. కోనసీమ ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు బీజేపీ పంతం.. ఇటు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పలుచోట్ల పరిస్థితి ఉద్రిక్తకు దారి తీసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
