జగన్‌రెడ్డి ప్రచారం పిచ్చి.. పరాకాష్టకు చేరింది : చంద్రబాబు

జగన్‌రెడ్డి ప్రచారం పిచ్చి.. పరాకాష్టకు చేరింది : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు చూడని ఉన్మాద పాలన రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో... ఏ విధ్వంసం సృష్టిస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజవర్గంపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది తయారవుతున్నాడని చంద్రబాబు ఆరోపించారు.

జగన్‌రెడ్డి ప్రచారం పిచ్చి.. పరాకాష్టకు చేరిందన్నారు చంద్రబాబు. సర్వేరాళ్లపై కూడా జగన్‌రెడ్డి బొమ్మలు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, గ్రానైట్‌ సర్వే రాళ్లు వేయడం వంటివి తుగ్లక్‌ చర్యలుగా అభివర్ణించారు. ఏపీని దేశంలో 27వ స్థానానికి వైసీపీ దిగజార్చిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రం ముద్దాయిల ఇష్టారాజ్యంగా మారిందన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎలా బరితెగించారో ప్రజలు చూస్తున్నారన్నారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో... ఏ విధ్వంసం సృష్టిస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.

వైసీపీ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు చంద్రబాబు. ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం, పాత పథకాలకే కొత్తపేర్లు పెట్టడం వంటి చర్యలతో రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story