Chandrababu : నేను లెక్క రాసుకుంటున్నా.. బీ కేర్ఫుల్..

X
By - Sai Gnan |20 Sept 2022 6:00 PM IST
Chandrababu : చిత్తూరు వేదికగా జగన్ సర్కారుకు హెచ్చరికలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు
Chandrababu : చిత్తూరు వేదికగా జగన్ సర్కారుకు హెచ్చరికలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దెబ్బకు దెబ్బ తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి లెక్కరాసుకుంటున్నా.. బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరించారు. బాబాయ్ని చంపిన జగన్.. కేసు నుంచి బయట పడేందుకు సీబీఐని కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.
175 సీట్లు గెలుస్తామని ప్రగల్బాలు పలుకుతున్న జగన్.. ముందు పులివెందులలో గెలవమంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. పులివెందుల బాంబులకు భయపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు. ఏపీని 3 ముక్కలాట చేశారన్న చంద్రబాబు... రాజధానిపై మాటతప్పి మడమ తిప్పారు- చంద్రబాబు
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com