Chandrababu : లోన్‌యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు

Chandrababu : లోన్‌యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు
Chandrababu : ఏపీలో లోన్‌ యాప్‌ల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu : ఏపీలో లోన్‌ యాప్‌ల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. లోన్‌ యాప్‌ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందంటూ ట్వీట్‌ చేశారు. నిన్న రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన మరువ ముందే.. ఇవాళ పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు.

మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తూ వేధిస్తున్న ఇలాంటి లోన్‌ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అంతేకానీ చావు పరిష్కారం కాదన్నారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇలాంటి లోన్‌ యాప్‌ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story