Chandrababu Naidu : అశ్లీల నృత్యాలు, కేసినో కల్చర్లో ఏపీని నెంబర్ వన్ చేశారు: చంద్రబాబు

Chandrababu Naidu : గుడివాడలో కేసినో నిర్వహించిన మంత్రి, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ హయాంలో ఏపీని పారిశ్రామిక అభివృద్ధిలో నంబర్వన్గా నిలిపితే...వైసీపీ సర్కార్ అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, కేసినో కల్చర్లో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టిందంటూ ఎద్దెవా చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేయడం ఉన్మాదానికి పరాకాష్ట అన్నారు చంద్రబాబు.
జగన్ సర్కార్ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని నేతలకు సూచించారు. అక్రమ కేసులకు భయపడొద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసారి ఇచ్చారు. దేశంలో 12కు పైగా రాష్ట్రాల్లో స్కూల్స్ సెలవులు పొడిగించగా...ఏపీలో మాత్రం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగుల విషయంలోనూ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com