Chandrababu naidu : మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా.. నిండు సభలో చంద్రబాబు శపథం..

Chandrababu naidu : మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా.. నిండు సభలో చంద్రబాబు శపథం..
Chandrababu naidu : నిండు సభలో తన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదనకు గురై ఓదశలో కంట తడిపెట్టారు.

Chandrbabu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. నిండు సభలో తన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదనకు గురై ఓ దశలో కంట తడిపెట్టారు. ఈ సభలో పడరాని అవమానాలు పడ్డాక, చివరికి కుంటుంబంపైనా విమర్శలు చేస్తుంటే ఇక తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. దీంతో.. సభకు నమస్కారం పెట్టి చంద్రబాబు బయటకు వెళ్లిపోయారు. ఆయనతోపాటు టీడీపీ సభ్యులు కూడా వాకౌట్ చేశారు.

ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షల మధ్య మాటల యుద్ధంతో ఇవాళ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కుప్పంలో ఓటమి తర్వాత చంద్రబాబును చూడాలని ఉందంటూ నిన్న CM వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఇవాళ దీనికి కొనసాగింపుగానా అన్నట్టు వైసీపీ సభ్యులు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు మైక్ ఇవ్వాలని కోరినా అవకాశం ఇవ్వకపోవడం, మైక్ ఇచ్చినా వెంటనే కట్ చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ఎన్నో అవమానాలకు గురి చేసినా సహించానని, కానీ శృతిమించి మాట్లాడుతున్న వైసీపీ సభ్యుల తీరుతో తీవ్రంగా ఆవేదనకు గురయ్యానని అన్నారు. ఈ తీరుకు నిరసనగా సీఎం అయిన తరువాతే మళ్లీ ఈ అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు.

ఇవాళ సభలో మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబుతోపాటు పలువురు సభ్యులు రన్నింగ్ కామెంట్రీగా చేసిన వ్యాఖ్యలతోనే చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సభలో చర్చల సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలు ఎన్నోసార్లు తాను చూశానని, కానీ వ్యక్తిగతంగా తన భార్య, కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శలతో కలత చెందానని గద్గద స్వరంతో మాట్లాడారు. ఆ తర్వాతే ఇక సభకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ CM అయ్యాకే సభలో అడుగుపెడతానని చెప్పి బయటకు వచ్చేశారు.

Tags

Read MoreRead Less
Next Story