ఆలయ గర్భగుడిలోకి అనుమతించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం!

ఆలయ గర్భగుడిలోకి అనుమతించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం!
గర్భగుడికి తాళాలు వేశారు ఆలయ అధికారులు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. బయటి నుంచి గుడిలో పరిస్థితిని పరిశీలించారు.

రామతీర్థంలో ఆలయ అధికారుల వైఖరిపై చంద్రబాబు ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్వంసమైన విగ్రహాలను చూసేందుకు చంద్రబాబు కొండపైకి వెళ్లగా.. ఆలయానికున్న తాళాలు కూడా తీయలేదు. ఇదేంటని అడిగితే విచారణ జరుగుతోందంటూ ఆలయ అధికారులు చెప్పారని టీడీపీ నేతలు తెలిపారు.

అంతకుముందే.. విజయసాయిరెడ్డి ఆలయంలోకి వెళ్లి పూజలు చేశారు. చంద్రబాబుకు మాత్రం పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట నుంచే విగ్రహాలను పరిశీలించిన చంద్రబాబు అనంతరం రాముని విగ్రహం తలను విసిరేసిన కోనేరును సైతం పరిశీలించారు.

గుడి తాళాలు తీయాలని కోరితే పోలీసులు విచారణ పేరు చెప్పారంటున్నారు టీడీపీ నేతలు. అంతకుముందు ఆలయంలో పూజలు కూడా చేశారు విజయసాయిరెడ్డి. ఆలయంలో ఆయనతో పాటు వైసీపీ నేతలంతా కూర్చుని పూజలు చేశారు. కానీ చంద్రబాబుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఆలయ వర్గాలు, పోలీసుల వైఖరిపై మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story