ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..!

X
By - TV5 Digital Team |21 Feb 2021 11:53 AM IST
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉక్కు ఫ్యాక్టరీ చరిత్ర, ప్లాంట్తో రాష్ట్ర ప్రజలకు ఉన్న బంధాన్ని గుర్తు చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉక్కు ఫ్యాక్టరీ చరిత్ర, ప్లాంట్తో రాష్ట్ర ప్రజలకు ఉన్న బంధాన్ని గుర్తు చేశారు. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్లాంట్ పరిరక్షణపై దృష్టి పెట్టాలని ప్రధానిని లేఖలో కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు జీవ నాడి అని.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్లాంట్ను సాధించారన్నారు. పోరాటంలో ఎంతోమంది అసువులుబాసారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీకే కాదు.. దేశానికే గర్వకారణమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com