అప్పుతెచ్చి పంచడమే ముఖ్యమంత్రి పనా? : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అప్పుతెచ్చి పంచడమే ముఖ్యమంత్రి పనా? : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఏపీలో... నా ఇల్లు - నా సొంతం, నా ఇంటి స్థలం - నాకు ఇవ్వాలన్న నినాదంతో ఆందోళలు చేస్తామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మూడురోజుల..

ఏపీలో... నా ఇల్లు - నా సొంతం, నా ఇంటి స్థలం - నాకు ఇవ్వాలన్న నినాదంతో ఆందోళలు చేస్తామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు చేపడుతున్నట్లు తెలిపారు. రేపు ఇళ్ల లబ్ధిదారులతో టీడీపీ నేతలు భేటీలు నిర్వహిస్తామన్నారు.7న ఇళ్ల లబ్ధిదారులతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, 8న నియోజకవర్గాల్లో ప్రెస్‌మీట్‌లకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి టిడ్కో ఇళ్ళంటిని పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. అలాకాని పక్షంలో పేదలకు తామే ఇళ్లను స్వాధీనం చేస్తామన్నారు.

రాష్ట్రంలో ప్రతి అవినీతి పనిని సెంట్రలైజేషన్ చేయాలని జగన్‌ ప్రభుత్వం చూస్తోందన్నారు అచ్చెన్నాయుడు. అప్పుతెచ్చి పంచడమే ముఖ్యమంత్రి పనా అంటూ నిలదీశారు. ఇళ్ల పట్టాల పేరుతో ఇప్పటికీ వరకు 5 వేల కోట్లు కొట్టేశారన్నారు. చేతకాక టీడీపీపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు అచ్చెన్నాయుడు.

Tags

Read MoreRead Less
Next Story