Ramoji Rao: మార్గదర్శి సంస్థపై జగన్ పైశాచికత్వం

Ramoji Rao: మార్గదర్శి సంస్థపై జగన్ పైశాచికత్వం
X
మార్గదర్శి కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు

మార్గదర్శిపై జగన్‌ సర్కార్‌ కక్ష సాధింపుల చర్యలు పీక్‌ చేరాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్గదర్శి కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.ఏపీలోని పలు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సీఐడీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు. అయితే మీడియాను మాత్రం లోపలికి అనుమతించకుండా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఒక్కో బృందంలో ఏడు నుంచి ఎనిమిది మంది అధికారులు ఉన్నట్లు సమాచారం.

ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ 50 సంవత్సరాలుగా నడుస్తోంది. అయితే సంస్థలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌పై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శికి చెందిన ఆస్తులను కూడా సీజ్‌ చేసింది. మార్గదర్శి చిట్స్‌ కార్యాలయాలపై సోదాలు చేసి, పలువురు సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే సీఐడీ తీసుకున్న చర్యలపై మార్గదర్శి ఎప్పటికప్పుడు కోర్టుల ఆశ్రయిస్తోంది. ఈ కేసులో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌లను హైదరాబాద్‌లో ప్రశ్నించారు. మరోసారి విచారణలో భాగంగా ఈ నెల 16,17న విజయవాడలో తమ ముందు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు.

Tags

Next Story