CJI: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలి: సీజేఐ

CJI: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలి: సీజేఐ
X
సీజేఐ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంలోకి అమల్లోకి వచ్చి 75 ఏళ్లు.. మంగళగిరిలో కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ

భారత రా­జ్యాం­గం ఏర్ప­డి 75 ఏళ్లు వి­జ­య­వం­తం­గా పూ­ర్త­య్యా­య­ని,ఈ కా­లం­లో అనేక సవ­ర­ణ­లు, రి­జ­ర్వే­ష­న్ల­ను రా­జ్యాం­గం అవ­కా­శం కల్పిం­చిం­దిం­ద­ని భారత సు­ప్రీం­కో­ర్టు ప్ర­ధాన న్యా­య­మూ­ర్తి బీ­ఆ­ర్‌ గవా­య్‌ అన్నా­రు. మహి­ళ­ల­కు 33శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తూ పా­ర్ల­మెం­ట్‌­లో­నూ చట్టం చే­శా­ర­ని, ఎస్సీ వర్గీ­క­ర­ణ­కు అను­గు­ణం­గా సు­ప్రీం­కో­ర్టు తీ­ర్పు ఇచ్చిం­ద­ని, ఎస్సీ, ఎస్టీ రి­జ­ర్వే­ష­న్ల­లో క్రీ­మి­లే­య­ర్ ఉం­డా­ల­నే­ది తన అభి­ప్రా­య­మ­ని పే­ర్కొ­న్నా­రు. భారత రా­జ్యాం­గం అమ­ల్లో­కి వచ్చి 75 ఏళ్లు పూ­ర్త­యిన సం­ద­ర్భం­గా ఏపీ హై­కో­ర్టు న్యా­య­వా­దుల ఆధ్వ­ర్యం­లో మం­గ­ళ­గి­రి­లో కా­ర్య­క్ర­మం ని­ర్వ­హిం­చా­రు. దీ­ని­కి ఆయన ము­ఖ్య అతి­థి­గా హా­జ­రై మా­ట్లా­డా­రు. ప్రా­థ­మిక హక్కు­ల­కు భంగం కలి­గి­తే కో­ర్టు­ల­ను ఆశ్ర­యిం­చే హక్కు రా­జ్యాం­గం కల్పిం­చిం­ద­ని జస్టి­స్‌ బీ­ఆ­ర్‌ గవా­య్‌ అన్నా­రు. ‘‘సాం­ఘిక ఆర్థిక న్యాయ సాధన కోసం రా­జ్యాం­గం­లో ఆదే­శిక సూ­త్రా­ల­ను పొం­దు­ప­రి­చా­రు. రా­జ్యాం­గా­న్ని రా­జ్యాంగ సభకు అప్ప­గి­స్తూ డా­క్ట­ర్‌ బీ­ఆ­ర్‌ అం­బే­డ్క­ర్‌ చే­సిన ప్ర­సం­గం.. ప్ర­తి న్యా­య­వా­ది­కి కం­ఠో­పా­ఠం కా­వా­లి. రా­జ్యాం­గా­న్ని అం­బే­డ్క­ర్ ఓ స్థిర పత్రం­గా చూ­డ­లే­దు. కా­లా­ను­గు­ణం­గా మా­ర్పు­లు అవ­స­ర­మ­నే భా­విం­చా­రు. అంశం ప్రా­ధా­న్య­త­ను బట్టి సవరణ వి­ధా­నా­ల­ను పొం­దు­ప­రి­చా­రు. కొ­న్ని అం­శా­ల్లో సవరణ సు­ల­భం.. కొ­న్ని అం­శా­ల్లో చాలా కఠి­నం. రా­జ్యాం­గం అమ­ల్లో­కి వచ్చిన మరు­స­టి ఏడా­దే రి­జ­ర్వే­ష­న్ల అం­శం­పై మొ­ద­టి సవరణ చే­సు­కు­న్నాం. రా­జ్యాంగ సవరణ అం­శం­పై కేం­ద్రా­ని­కి, సు­ప్రీం­కో­ర్టు­కు మొ­ద­ట్లో కొంత ఘర్షణ వా­తా­వ­ర­ణం ఏర్ప­డిం­ది. కే­శ­వా­నంద భా­ర­తి కే­సు­లో రా­జ్యాం­గం మౌ­లిక స్వ­రూ­పా­న్ని సవ­రిం­చ­రా­ద­ని సు­ప్రీం­కో­ర్టు చె­ప్పిం­ది.” అని సీ­జేఐ గు­ర్తు చే­శా­రు.

ఎస్సీ వర్గీ­క­ర­ణ­కు అను­కూ­లం­గా గతే­డా­ది ఏడు­గు­రు జడ్జిల సు­ప్రీం­కో­ర్టు ధర్మా­స­నం తీ­ర్పు ఇచ్చిం­ది. ఎస్సీ, ఎస్టీ రి­జ­ర్వే­ష­న్ల­లో­నూ క్రి­మీ­లే­య­ర్‌ వి­ధా­నం ఉం­డా­ల­న్న­ది నా అభి­ప్రా­యం. పని ప్ర­దే­శా­ల్లో మహి­ళ­ల­పై వి­వ­క్ష ఉం­డ­రా­ద­ని వి­శాఖ కేసు తీ­ర్పు­లో సర్వో­న్నత న్యా­య­స్థా­నం తీ­ర్పు ఇచ్చిం­ది. కొ­న్నే­ళ్లు­గా మహి­ళ­లు న్యాయ వి­ద్య­లో బాగా రా­ణి­స్తు­న్నా­రు. రా­జ్యాం­గం కల్పిం­చిన హక్కుల పట్ల ప్ర­జ­ల­కు అవ­గా­హన ఉం­డా­లి’’ అని సీ­జేఐ జస్టి­స్‌ బీ­ఆ­ర్‌ గవా­య్‌ అన్నా­రు.

రాజ్యాంగం అత్యుత్తమం: చంద్రబాబు

బీ­ఆ­ర్‌ అం­బే­డ్క­ర్‌ అత్యు­న్న­త­మైన రా­జ్యాం­గం రూ­పొం­దిం­చా­ర­ని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. చా­య్‌­వా­లా దే­శా­ని­కి ప్ర­ధా­ని అయ్యా­రం­టే అది మన రా­జ్యాం­గం వల్లే­న­ని పే­ర్కొ­న్నా­రు. ‘‘ఆర్థిక సం­స్క­ర­ణ­లు దేశ ది­శ­నే మా­ర్చే­శా­యి. 2014లో 11వ ఆర్థిక వ్య­వ­స్థ­గా ఉన్న మనం ఇప్పు­డు నా­లు­గో ఆర్థిక వ్య­వ­స్థ­కు చే­రాం. వచ్చే ఏడా­ది భా­ర­త్‌ ప్ర­పం­చం­లో మూడో, 2038 నా­టి­కి రెం­డో అతి­పె­ద్ద ఆర్థిక వ్య­వ­స్థ­గా కా­బో­తోం­ది. 2047 నా­టి­కి భా­ర­త్‌ ప్ర­పం­చం­లో­నే అతి పె­ద్ద ఆర్థిక వ్య­వ­స్థ­గా అవ­త­రిం­చా­ల­న్న­ది లక్ష్యం. ప్ర­జా­స్వా­మ్యం గాడి తప్పి­న­ప్పు­డు న్యాయ వ్య­వ­స్థే దా­న్ని గా­డిన పె­డు­తోం­ది. మీ­డి­యా రం­గం­లో­నూ ఇటీ­వల చాలా మా­ర్పు­లు వచ్చా­యి. సో­ష­ల్‌ మీ­డి­యా­లో ప్ర­తి ఒక్క­రూ రై­ట­రే.. ప్ర­తి ఒక్క­రూ ఎడి­ట­రే. సా­మా­జిక మా­ధ్య­మా­ల­ను వ్య­క్తి­త్వ హన­నా­ని­కి ఉప­యో­గిం­చ­డం దు­ర­దృ­ష్ట­క­రం’’ అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

Tags

Next Story