CM: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. సీఎం సీరియస్

CM: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు..  సీఎం సీరియస్
X
దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు... ఆందోళనకు దిగిన స్థానికులు, దళిత నేతలు.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు

చి­త్తూ­రు జి­ల్లా జీడీ నె­ల్లూ­రు మం­డ­లం దే­వ­ళం­పే­ట­లో­ని అం­బే­ద్క­ర్ వి­గ్ర­హా­ని­కి ని­ప్పు పె­ట్ట­డం­తో ఉద్రి­క్తత చోటు చే­సు­కుం­ది. అం­బే­ద్క­ర్ వి­గ్ర­హా­ని­కి గు­ర్తు­తె­లి­య­ని దుం­డ­గు­లు ని­ప్పు పె­ట్టా­రు. దీం­తో గ్రా­మ­స్తు­లు ఆం­దో­ళ­న­కు ది­గా­రు. నిం­ది­తు­ల­ను కఠి­నం­గా శి­క్షిం­చా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. ఈ ని­ర­స­న­ల­కు మాజీ డి­ప్యూ­టీ సీఎం నా­రా­యణ స్వా­మి మద్ద­తు­ప­లి­కా­రు. ఈ ఘట­న­పై సీ­ఎం­వో కా­ర్యా­ల­యం­తో పాటు హోం­మం­త్రి వం­గ­ల­పూ­డి అనిత ఆరా తీ­శా­రు. నిం­ది­తు­ల­ను కఠి­నం­గా శి­క్షి­స్తా­మ­ని హె­చ్చ­రిం­చా­రు. పూ­త­ల­ప­ట్టు, నె­ల్లూ­రు గం­గా­ధర నె­ల్లూ­రు ఎమ్మె­ల్యే­లు సౌతం ఆరా తీ­శా­రు. స్థా­నిక ఎస్పీ పరి­స్థి­తి­ని సమీ­క్షి­స్తు­న్నా­రు. గ్రా­మం­లో పో­లీ­సు­లు భా­రీ­గా మో­హ­రిం­చా­రు. ఈ ఘట­న­ను సు­మో­టో­గా తీ­సు­కు­ని నిం­ది­తు­ల­ను గు­ర్తిం­చి కఠి­నం­గా శి­క్షిం­చా­ల­ని మాజీ డి­ప్యూ­టీ సీఎం నా­రా­యణ స్వా­మి డి­మాం­డ్ చే­శా­రు. అం­త­కు ముం­దు స్థా­ని­కు­లు వి­నూ­త్న రీ­తి­లో తమ ని­ర­సన తె­లి­య­జే­శా­రు. నిం­ది­తు­ల్ని అరె­స్ట్ చే­యా­లం­టూ.. నగి­రి డీ­ఎ­స్పీ సయ్య­ద్ అజీ­జ్, వె­దు­రు­కు­ప్పం ఎస్సై వెం­క­ట­సు­బ్బ­య్య కా­ళ్ల మీద పడి వే­డు­కు­న్నా­రు. ఘట­న­కు కా­ర­కు­ల­ను వెం­ట­నే అరె­స్ట్‌ చేసి కఠి­నం­గా శి­క్షిం­చా­లం­టూ రో­డ్డు­పై బై­ఠా­యిం­చా­రు.

చంద్రబాబు సీరియస్

అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న కారణంగా జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు ఆగంతకులు రాత్రి నిప్పు పెట్టడటంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఘనటపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

సతీశ్ నాయుడు అనే స్థానిక నాయకుడికి అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఇష్టంలేదని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. సతీశ్ నాయుడే నిప్పు పెట్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Tags

Next Story