AP: వారికి సీఎం చంద్రబాబు వార్నింగ్

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘ఆడబిడ్డలు విలాస వస్తువులు కాదు. అలా చూస్తే ఖబద్దార్.. మీ అంతు చూస్తా. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి మక్కెలు ఇరగదీస్తా’. అని వార్నింగ్ ఇచ్చారు. ఇక చిన్నారులపై అత్యాచారాలు జరగడం దారుణమన్నారు. ఇద్దరు, ముగ్గురిని నడిరోడ్డుపై ఉరితీయాలని, అప్పుడే అలాంటి వాళ్లకు బుద్ది వస్తుందని సీఎం పేర్కొన్నారు. దీంతో పాటుగా ఇసుక అక్రమ రవాణా, బెల్ట్ షాపుల నిర్వహించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా: చంద్రబాబు
మద్యం అక్రమాలపై సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తానని హెచ్చరించారు. వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభిన చంద్రబాబు.. మద్యం షాపుల నిర్వహకులు ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలన్నారు. అలా కాదని ఎక్కువ ధరకు మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com