వైసీపీ అక్రమాల నిగ్గు తేల్చేందుకు టీడీపీ సీనియర్ నేతలతో కమిటీ

వైసీపీ నేతల అవినీతిపై మరింత గట్టిగా పోరాడాలని టీడీపీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా వివిధ అంశాల్లో వైసీపీ నేతల అక్రమాలు నిగ్గు తేల్చేందుకు పార్టీ సీనియర్ నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఇందులో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆలపాటి రాజా, వర్ల రామయ్య, అశోక్బాబు సభ్యులుగా ఉంటారు. అధికార పార్టీ నేతలపై పోలీస్ స్టేషన్లలో ఉన్న కేసులు, ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణల్ని సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాలని భావిస్తున్నారు. ఇందు కోసం క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించేందుకు ఏం చేయాలనేదానిపైనా ఫోకస్ పెట్టారు. ఇవాళ మాజీ మంత్రి సోమిరెడ్డి నివాసంలో సమావేశమైన కమిటీ సభ్యులు.. అనేక అంశాలపై చర్చించారు. 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశం జరగాలని, పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడాలని చంద్రబాబు సూచించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
RELATED STORIES
Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు..
20 Aug 2022 1:06 AM GMT5G Network Services : మీ ఫోన్కు 5జీ నెట్వర్క్ కనెక్ట్ అవుతుందా..?...
19 Aug 2022 2:38 PM GMTApple iPhone 14: యాపిల్ ఐఫోన్ 14.. లాంఛింగ్ డేట్..
19 Aug 2022 10:30 AM GMTGold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ...
19 Aug 2022 5:00 AM GMTInstagram: రీల్స్ చేసేవారికి ఇన్స్టాగ్రామ్ గుడ్ న్యూస్.. కొత్త...
18 Aug 2022 10:00 AM GMTMaruti Suzuki Alto K10: సరికొత్తగా మార్కెట్లోకి మారుతి సుజుకి ఆల్టో...
18 Aug 2022 6:15 AM GMT