తెనాలిలో కరోనా కలకలం.. కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులకు పాజిటివ్

తెనాలిలో కరోనా కలకలం.. కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులకు పాజిటివ్
మారిస్‌పేటలోని జీవనజ్యోతి నర్సింగ్‌ కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులు వైరస్ బారిన పడ్డారు.

గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.. నిన్న ఒక్కరోజే పట్టణంలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..మారిస్‌పేటలోని జీవనజ్యోతి నర్సింగ్‌ కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులు వైరస్ బారిన పడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఈ కాలేజ్‌లో నర్సింగ్ కోర్స్ చేస్తున్నారు.. తెనాలిలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కాలేజీలు‌, స్కూళ్లలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు..


Tags

Read MoreRead Less
Next Story