బెట్టింగ్‌ ..31 మంది క్రికెట్‌ బుకీల అరెస్ట్‌

బెట్టింగ్‌ ..31 మంది క్రికెట్‌ బుకీల అరెస్ట్‌

కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా సాగుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ పై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. జోరుగా సాగుతున్న బెట్టింగ్ గుట్టు రట్టు చేశారు. మొత్తం 31 మంది బుకీలను అరెస్ట్ చేశారు. ఈ ఐ.పి.ఎల్ సీజన్ లో దాదాపు 34 కోట్ల మేర బెట్టింగ్ కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

అరెస్ట్ అయిన బుకీల నుంచి లక్షరూపాయల నగదు, ఆరు కిలోల గంజాయి, రెండు మొబైల్ కమ్యూనికేటర్లు, ఏడు ల్యాప్ టాప్ లు, రెండు వాహనాలు, అకౌంట్ పాస్ బుక్ లు, క్యాలుక్యులేటర్లు స్వాధీనం చేసుకున్నారు.. బెంగళూర్, హైదరాబాద్, గోవాతో పాటు పలు నగరాలకు వీరి నెట్ వర్క్ విస్తరించిందని ఎస్పీ అన్భురాజ్ అన్నారు. ఇప్పటికే వారి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశామని.. పరారీలో ఉన్న బుకీల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు.


Tags

Read MoreRead Less
Next Story