Crime: సెల్ఫీతీసి కుమారుడికి పంపి దంపతుల ఆత్మహత్య

X
By - Subba Reddy |28 March 2023 11:15 AM IST
ఆర్ధిక ఇబ్బందులతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం
విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. వడ్లమూడి తిరుమలనగర్లో నివాసముంటున్న వరప్రసాద్ విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉండటంతో భార్య మీనాతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తాము సూసైడ్ చేసుకుంటున్నట్లు వరప్రసాద్, మీనా సెల్పీ వీడియో తీసి కుమారుడు కృష్ణ సాయితేజకు పంపారు. అనంతరం ఫోన్ స్విఛ్చాప్ చేసుకున్నారు. దీంతో కృష్ణసాయితేజ దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ఏటికొప్పాక ఏలూరు కాలువ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, మొబైల్ గుర్తించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com