Crime : ఇంజనీర్ నాగరాజు హత్య కేసులో నిందితులు అరెస్ట్

తిరుపతి జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో ఎ1 రిపుంజయ, ఎ2 చాణక్య ప్రతాప్.. ఎ3 గోపినాథ్ రెడ్డి, ఎ4 అప్పన రమేష్, ఎ5 అప్పన కుమార్ ఉన్నారు. ఎ2 చాణక్య ప్రతాప్ ఇంకా పరారీలో ఉన్నాడు. చాణక్య ప్రతాప్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కుట్ర పన్ని.. పథకం ప్రకారమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజును హత్య చేశారని ఏఎస్పీ వెంకట్రావ్ తెలిపారు. రిపుంజయ భార్యతో నాగరాజు సోదరుడు పురుషోత్తం వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణంగా తెలిపారు. తన భార్యతో వివాహేతర సంబంధంపై గ్రామంలో ప్రచారం చేసి పరువు తీయడంతో... నాగరాజును రిపుంజయ చంపినట్లు వివరించారు. నాగరాజుకు మద్యం తాగించి ముక్కు, నోరు అదిమి చంపేశారని.. అనంతరం కారులో పడేసి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు ఏఎస్పీ వెంకట్రావ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com