MONTHA: ఏపీ వైపు దూసుకొస్తున్న "మొంథా" ముప్పు

MONTHA: ఏపీ వైపు దూసుకొస్తున్న మొంథా ముప్పు
X
ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుఫాను ముప్పు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావారణ శాఖ... పాఠశాలలకు మూడు రోజులు సెలవులు.. అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆగ్నేయ బం­గా­ళా­ఖా­తం­లో ఏర్ప­డిన తీ­వ్ర అల్ప­పీ­డ­నం కా­ర­ణం­గా ఏపీ­కి తు­ఫా­ను ము­ప్పు పొం­చి ఉంది. ఈ అల్ప­పీ­డ­నం క్ర­మం­గా బల­ప­డి తీ­వ్ర వా­యు­గుం­డం­గా, సో­మ­వా­రం నా­టి­కి తు­ఫా­ను­గా మారే అవ­కా­శం ఉం­ద­ని వా­తా­వ­రణ శాఖ హె­చ్చ­రిం­చిం­ది. దీని ప్ర­భా­వం­తో కో­న­సీమ, కృ­ష్ణా, బా­ప­ట్ల, ప్ర­కా­శం, నె­ల్లూ­రు, తి­రు­ప­తి జి­ల్లా­ల్లో భారీ వర్షా­లు, మి­గి­లిన జి­ల్లా­ల్లో మో­స్త­రు వర్షా­లు కు­రి­సే అవ­కా­శం ఉంది. వా­యు­గుం­డం తదు­ప­రి పశ్చిమ-వా­యు­వ్య ది­శ­గా కదు­లు­తూ... నే­టి­కి తీ­వ్ర వా­యు­గుం­డం­గా, రే­ప­టి­కి ఉద­యా­ని­కి తు­పా­ను­గా బల­ప­డే అవ­కా­శం ఉం­ద­ని ఏపీ వి­ప­త్తుల ని­ర్వ­హణ సం­స్థ (ఏపీ­ఎ­స్‌­డీ­ఎంఏ) తె­లి­పిం­ది. మం­గ­ళ­వా­రం ఉద­యా­ని­కి తీ­వ్ర తు­పా­ను­గా మారే అవ­కా­శం ఉం­ద­ని హె­చ్చ­రిం­చిం­ది. మచి­లీ­ప­ట్నం-కళిం­గ­ప­ట్నం మధ్య కా­కి­నాడ సమీ­పం­లో తీ­రా­న్ని దాటే అవ­కా­శం ఉం­ద­ని పే­ర్కొం­ది. తీరం దాటే సమ­యం­లో గరి­ష్టం­గా గం­ట­కు 90-110 కి.మీ వే­గం­తో బల­మైన ఈదు­రు­గా­లు­లు వీ­స్తా­య­ని హె­చ్చ­రిం­చిం­ది. మరో­వై­పు వా­తా­వ­రణ కేం­ద్రం అధి­కా­రు­లు కూడా అక్టో­బ­ర్ 26 నుం­చి 29 వరకు ఏపీ­లో అతి భా­రీ­వ­ర్షా­లు కు­రు­స్తా­య­ని హె­చ్చ­రి­స్తు­న్నా­రు. ఈ క్ర­మం­లో­నే వా­తా­వ­రణ శాఖ రె­డ్‌ అలె­ర్ట్‌ జారీ చే­సిం­ది. భారీ వర్షాల నే­ప­థ్యం­లో తీర ప్రాంత జి­ల్లా­ల్లో ఉన్న వి­ద్యా సం­స్థ­ల­కు సె­ల­వు ప్ర­క­టిం­చా­ల­ని వా­తా­వ­రణ శాఖ అధి­కా­రు­లు సూ­చిం­చా­రు.

రెడ్‌ అలర్ట్‌ జారీ

‘మొం­థా’ ప్ర­భా­వం­తో రా­ష్ట్రం­లో­ని పలు ప్రాం­తా­ల్లో వి­స్తా­రం­గా వర్షా­లు కు­రి­సే అవ­కా­శ­ముం­ద­ని అమ­రా­వ­తి వా­తా­వ­రణ కేం­ద్రం పే­ర్కొం­ది. సోమ, మంగళ, బు­ధ­వా­రా­ల్లో కొ­న్ని జి­ల్లా­ల్లో అత్యంత భారీ వర్షా­లు కు­రి­సే అవ­కా­శ­ము­న్న నే­ప­థ్యం­లో ‘రె­డ్‌’ అల­ర్ట్‌ జారీ చే­సిం­ది. సము­ద్రం అల­జ­డి­గా మా­రి­నం­దున బు­ధ­వా­రం వరకు మత్స్య­కా­రు­లు వే­ట­కు వె­ళ్ల­రా­ద­ని వి­శా­ఖ­లో­ని తు­పా­ను హె­చ్చ­రి­కల కేం­ద్రం సూ­చిం­చిం­ది. వి­శా­ఖ­ప­ట్నం, మచి­లీ­ప­ట్నం, కృ­ష్ణ­ప­ట్నం, ని­జాం­ప­ట్నం, గం­గ­వ­రం, కా­కి­నాడ పో­ర్టు­ల­కు ఒకటో నం­బ­రు హె­చ్చ­రి­క­లు జారీ చే­సిం­ది. తీ­వ్ర తు­పా­ను తీరం దాటే సమ­యం­లో గరి­ష్ఠం­గా గం­ట­కు 110 కి­లో­మీ­ట­ర్ల వే­గం­తో గా­లు­లు వీ­యొ­చ్చ­ని రా­ష్ట్ర వి­ప­త్తుల ని­ర్వ­హణ సం­స్థ తె­లి­పిం­ది. ఈ నే­ప­థ్యం­లో ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని సూ­చిం­చిం­ది.

తీరం వెంబడి బలమైన గాలులు

బం­గా­ళా­ఖా­తం­లో అల్ప­పీ­డన ప్ర­భా­వం­తో "తీరం వెం­బ­డి గం­ట­కు 50 నుం­చి 70 కి­లో­మీ­ట­ర్ల వే­గం­తో బల­మైన ఈదు­రు­గా­లు­లు వీ­స్తా­యి. మత్స్య­కా­రు­లు సము­ద్ర వే­ట­కు వె­ళ్ల­కూ­డ­దు. ...తదు­ప­రి సూ­చ­న­లు వచ్చే­వ­ర­కు బో­ట్ల­ను లం­గ­రు వేసి ఉం­చి­తే మం­చి­ది," అని వి­శాఖ తు­పా­ను హె­చ్చ­రి­కల కేం­ద్రం అధి­కా­రి జ జగ­న్నా­ధ­కు­మా­ర్ తె­లి­పా­రు. రై­తు­లు వ్య­వ­సాయ పను­ల్లో జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­ని, పం­ట­ల­ను రక్షిం­చే చర్య­లు ముం­దు­గా­నే తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­లు సూ­చిం­చా­రు. లో­త­ట్టు ప్రాం­తాల ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని, తు­పా­ను సమ­యం­లో అత్య­వ­స­రం అయి­తే తప్ప బయ­ట­కు రా­వొ­ద్ద­ని హె­చ్చ­రిం­చా­రు. "మె­రు­పు­ల­తో కూ­డిన వర్షం, ఉరు­ము­లు పడే అవ­కా­శం ఉన్నం­దున చె­ట్ల కింద, వి­ద్యు­త్ స్తం­భాల దగ్గర, హో­ర్డిం­గ్‌­లు ఉన్న ప్ర­దే­శా­ల్లో ని­ల­వ­కం­డి. ఎల­క్ట్రా­ని­క్ పరి­క­రా­ల­ను ప్ల­గ్‌­లో ఉం­చ­కూ­డ­దు" అని సూ­చిం­చా­రు.

ముఖ్యమంత్రి సమీక్ష

ఏపీ­కి మొం­థా తు­పా­ను ము­ప్పు పొం­చి ఉన్న నే­ప­థ్యం­లో సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు అధి­కా­రు­ల­ను అప్ర­మ­త్తం చే­శా­రు. 'మొం­థా' తు­ఫా­ను ప్ర­భా­వం­పై సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు శని­వా­రం జి­ల్లా కలె­క్ట­ర్లు, ఉన్న­తా­ధి­కా­రు­ల­తో సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. రా­ను­న్న 4 రో­జు­ల­లో తు­ఫా­ను ప్ర­భా­వం తీ­వ్రం­గా ఉండే అవ­కా­శా­న్ని సూ­చి­స్తూ వా­తా­వ­రణ శాఖ రెడ్ అలె­ర్ట్ జారీ చే­సిం­ద­ని గు­ర్తు­చే­శా­రు. శ్రీ­కా­కు­ళం జి­ల్లా నుం­చి తి­రు­ప­తి వరకూ దీని ప్ర­భా­వం ఉం­టుం­ద­ని... భారీ వర్షా­లు కు­రి­సే అవ­కా­శం ఉం­ద­ని, ఈ కా­ర­ణం­గా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు సం­ప­ద­కు నష్టం జర­గ­కుం­డా ముం­ద­స్తు చర్య­లు చే­ప­ట్టా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. రి­య­ల్ టై­మ్‌ సమా­చా­రా­న్ని క్షే­త్ర స్థా­యి వరకు తీ­సు­కు­వె­ళ్లా­ల­ని చె­ప్పా­రు. ఎన్డీ­ఆ­ర్ఎ­ఫ్, ఎస్డీ­ఆ­ర్‌­ఎ­ఫ్ బృం­దా­ల­ను ముం­దు­గా­నే సి­ద్ధం చే­యా­ల­ని ఆదే­శిం­చా­రు. మొం­థా తు­ఫా­న్ ముం­చు­కొ­స్తు­న్న నే­ప­థ్యం­లో డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ అధి­కా­రు­ల­కు కీలక ఆదే­శా­లు జారీ చే­శా­రు. ఎలాం­టి పరి­స్థి­తు­ల­నై­నా ఎదు­ర్కొ­నేం­దు­కు యం­త్రాం­గం సన్న­ద్ధం­గా ఉం­డా­ల­ని తె­లి­పా­రు. రె­వె­న్యూ, వ్య­వ­సాయ, నీ­టి­పా­రు­దల, పో­లీ­స్, అగ్ని­మా­పక శా­ఖ­ల­తో­పా­టు డి­జా­స్ట­ర్ రె­స్పా­న్స్ ఫో­ర్స్ బృం­దా­ల­ను సి­ద్ధం­గా ఉం­డా­ల­ని ఆదే­శా­లు జారీ చే­శా­రు.

Tags

Next Story