ఇవాళ్టి నుంచి జగన్ ఆస్తుల కేసుపై CBI కోర్టులో రోజువారీ విచారణ

X
By - kasi |13 Oct 2020 8:16 AM IST
జగన్ ఆస్తుల కేసుపై CBI కోర్టులో రోజువారీ విచారణ ఇవాళ్టి నుంచి జరగనుంది. ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న ఈ కేసుల విషయంపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరగనుంది. నిన్న సీబీఐ న్యాయమూర్తి సెలవు కారణంగా విచారణ జరగలేదు. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ వాదనలు కొనసాగనున్నాయి. 11 CBI కేసులు, 5 ED కేసుల విషయంలో కొన్నింటిపై స్టే ఉన్న నేపథ్యంలో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇవాళ తెలియనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com