DEEPAWALI: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి సంబరాలు

DEEPAWALI: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి సంబరాలు
X
టపాసులు పేల్చిన చంద్రబాబు, వైఎస్ జగన్

దే­శ­వ్యా­ప్తం­గా పలు రా­ష్ట్రా­ల­లో దీ­పా­వ­ళి సం­బ­రా­లు ఘనం­గా జరి­గా­యి. పలు ప్రాం­తా­ల్లో కు­టుంబ సభ్యు­ల­తో కలి­సి ప్ర­జ­లు దీ­పా­వ­ళి సం­బ­రా­లు జరు­పు­కు­న్నా­రు. వీ­ధు­ల్లో టపా­సు­లు కా­ల్చు­తూ, మతా­బు­లు వె­లి­గి­స్తూ చి­న్నా­రు­లు, పె­ద్ద­లు ఆనం­దో­త్స­వా­లు వ్య­క్తం చే­శా­రు. అనేక ఇళ్ల­ను దీ­పా­ల­తో అలం­క­రణ చే­శా­రు. చా­రి­త్రక భవ­నా­లు ప్ర­త్యే­కం­గా ము­స్తా­బు చే­శా­రు. వ్యా­పార భవ­నా­లు వి­ద్యు­త్ కాం­తు­ల­తో మె­రు­స్తు­న్నా­యి. అనే­క­మం­ది ప్ర­ము­ఖు­లు తమ ఇళ్ళ ముం­దు దీ­పా­వ­ళి సం­బ­రా­ల­ను జరు­పు­కు­న్నా­రు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తమ నివాసంలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు దంపతులు బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.


దీపావళి వేడుకలను వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోని తన నివాసంలో సతీమణి భారతితో కలిసి జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు జగన్‌ ఎక్స్‌‌లో తెలిపారు.

రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా దీ­పా­వ­ళి సం­బ­రా­లు అం­బ­రా­న్నం­టా­యి. తి­రు­మల శ్రీ­వా­రి ఆల­యం­లో శా­స్త్రో­క్తం­గా దీ­పా­వ­ళి­ని ని­ర్వ­హిం­చా­రు. శ్రీ­దే­వి, భూ­దే­వీ సమేత మల­య­ప్ప స్వా­మి­కి సహ­స్ర దీ­పా­లం­క­రణ చే­శా­రు. వి­జ­య­వాడ గణ­ప­తి సచ్చి­దా­నంద ఆశ్ర­మం­లో లక్ష్మీ యాగం.. మా­ర్కా­పు­రం­లో­ని పలు వీ­ధు­ల్లో నర­కా­సు­రు­ని వధ ని­ర్వ­హిం­చా­రు. అం­తే­కా­కుం­డా రా­ష్ట్రం­లో పలు ప్రాం­తా­ల్లో నర­క­సుర వధను ఏర్పా­టు చే­య­గా.. ప్ర­జ­లు అస­క్తి­గా తి­ల­కిం­చా­రు. తి­రు­మల శ్రీ­వా­రి ఆల­యం­లో పం­డుగ సం­ద­ర్భం­గా దీ­పా­వ­ళి ఆస్థా­నా­న్ని శా­స్త్రో­క్తం­గా ని­ర్వ­హిం­చా­రు. ఉభ­య­దే­వే­రు­ల­తో మల­య్య­ప్ప స్వా­మి­ని సర్వ­భూ­పాల వా­హ­నం­పై బం­గా­రు­వా­కి­లి ముం­దు­న్న ఘంటా మం­డ­పం­లో ఉం­చా­రు. స్వా­మి వా­రి­కి ప్ర­త్యేక పూజ, హా­ర­తి, ప్ర­సాద ని­వే­ద­ల­ను చే­శా­రు. సా­యం­త్రం శ్రీ­దే­వి, భూ­దే­వీ సమేత మల­య­ప్ప స్వా­మి­కి సహ­స్ర దీ­పా­లం­క­రణ ని­ర్వ­హిం­చా­రు. అనం­త­రం మల­య­ప్ప­స్వా­మి­కి మాడ వీ­ధు­ల్లో ఊరే­గు­తూ భక్తు­ల­ను కటా­క్షిం­చా­రు. ఆస్థా­నం వల్ల కల్యా­ణో­త్స­వం, ఊం­జ­ల్ సేవ, బ్ర­హ్మో­త్స­వం ఆర్జిత సే­వ­ల­ను టీ­టీ­డీ రద్దు చే­సిం­ది.


దీ­పా­వ­ళి సం­ద­ర్భం­గా రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ఊరూ వాడ సం­ద­డి నె­ల­కొం­ది. ప్ర­కా­శం జి­ల్లా మా­ర్కా­పు­రం­లో పండగ సం­ద­ర్భం­గా నర­కా­సు­రు­ని వధ ని­ర్వ­హిం­చా­రు. సం­ప్ర­దాయ బద్ధం­గా రు­క్మి­ణీ, సత్య­భామ అవ­తా­రం­లో శ్రీ లక్ష్మీ చె­న్న­కే­శవ స్వా­మి ఊరే­గిం­పు­గా వచ్చి.. నర­కా­సు­రు­న్ని వధిం­చా­రు. కా­ర్య­క్ర­మా­న్ని తి­ల­కిం­చేం­దు­కు ప్ర­జ­లు పె­ద్దఎ­త్తున తర­లి­వ­చ్చా­రు.

శ్మశానంలో దీపావళి వేడుకలు

సా­ధా­ర­ణం­గా దీ­పా­వ­ళి అంటే దే­వు­ళ్ల­ను పూ­జిం­చి, ఇంటి ముం­దు దీ­పా­లు వె­లి­గిం­చి సం­తో­షం­గా పం­డు­గ­ను జరు­పు­కొం­టా­రు. కానీ మధ్య­ప్ర­దే­శ్​­లో­ని ఓ గ్రామ ప్ర­జ­లు మా­త్రం దీ­పా­వ­ళి ముం­దు రోజే పం­డుగ జరు­పు­కొం­టా­రు. అం­దు­లో వింత ఏముం­ది అని అను­కుం­టు­న్నా­రా? కానీ వా­ళ్లు దీ­పా­వ­ళి వే­డు­క­ల­ను చే­సు­కు­నే­ది ఇం­ట్లో కాదు శ్మ­శా­న­వా­టి­క­లో. దీ­పా­వ­ళి రోజు అం­ద­రూ ఇళ్ల ముం­దు దీ­పా­లు వె­లి­గి­స్తే, వీ­ళ్లు మా­త్రం శ్మ­శాన వా­టి­క­ల­కు వచ్చి సమా­ధుల ముం­దు దీ­పా­లు వె­లి­గిం­చా­రు. అం­ద­రూ కలి­సి టపా­సు­లు కా­ల్చి దీ­పా­వా­ళి పం­డు­గ­ను చే­సు­కు­న్నా­రు. ఈ ఆచా­రా­న్ని దా­దా­పు 20 సం­వ­త్స­రా­ల­కు పైగా కొ­న­సా­గి­స్తు­న్నా­రు.



Tags

Next Story