PAWAN: రాజధానిపై కుట్రలు చేస్తారా... ?

రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సాక్షి మీడియాలో ఓ చర్చ సందర్భంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఉపముఖ్యమంత్రి ఖండించారు. రాజధానిపై కుట్రలు చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..!
అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైస్సార్సీపీ నాయకుల మాటలు రాష్ట్ర గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరకరం చేసారు. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి అక్కసు.. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని హోం మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన మొదటి నుంచీ అమరావతిని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. అమరావతిని వేశ్యల రాజధాని అని అభద్రంగా చెప్పే వారిని ప్రోత్సహించిన వారెవరో బయట పెట్టాలని ఆమె స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com