నీట మునిగిన పంటల్ని పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమ
By - kasi |15 Oct 2020 7:04 AM GMT
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో అకాల వర్షాల వల్ల నీట మునిగిన పంటల్ని మాజీ మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణం స్పందించి వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టంపై అంచనాలు సిద్ధం చేసి బాధిత రైతుల్ని ఆదుకోవాలని దేవినేని ఉమ కోరారు. లంక ప్రాంతాల్లో కూరగాయల సాగు రైతులు కూడా నష్టపోయారని ప్రభుత్వం రైతులందరికీ భరోసా ఇవ్వాలన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com