శ్రీశైలంలో పెద్దపులి సంచారం

నంద్యాల జిల్లా శ్రీశైలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. సాక్షి గణపతి ఆలయం సమీపంలోకి పులి రావడంతో భక్తులు భయంతో వణికిపోయారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆపేశారు. పులి దృశ్యాలను కొంతమంది భక్తులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. పులి సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. పాదముద్రల ఆధారంగా పులిని గుర్తించే పనిలో పడ్డారు.
ఇటీవల కాలంలో శ్రీశైలం పరిధిలో పులి తరచూ ప్రజల కంటపడుతుంది. అంతకు ముందు శ్రీశైలంలోని తెలుగు యూనివర్సిటీ, గణేష్ సదనం ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపింది. తాజాగా సాక్షి గణపతి ఆలయం సమీపంలోకి పులి రావడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ పులి జనావాసాల్లోకి వస్తున్న అటవీశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి పులి రాకుండ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com