AP Police: సీఐ అంజూ యాదవ్పై క్రమశిక్షణా చర్య

జనసేన నేతపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి పట్టణ సీఐ అంజూ యాదవ్పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ దాడి ఘటనపై మీడియా ఫోకస్ చేయడంతో.. అంజూ యాదవ్ వ్యవహార శైలిపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి విచారణ జరిపి... డీఐజీకి నివేదిక ఇచ్చారు. ఇవాళ సాయంత్రంలోపు అంజూ యాదవ్కు ఛార్జీ మెమో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
అటు.. సీఐ అంజూ యాదవ్ దుందుడుకు చర్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఆయన రేపు తిరుపతికి వెళ్లి ఎస్పీకి వినతి పత్రం సమర్పించనున్నారు. పవన్ తిరుపతి టూర్ నేపథ్యంలో పోలీసు అధికారులపై ఒత్తిడి పెరిగింది. సీఐ అంజూ యాదవ్ వరుస వివాదాలపై వారు సీరియస్గా ఉన్నారు. మరోవైపు అంజూ యాదవ్ గతంలో దాడులకు పాల్పడిన, బెదిరింపులకు దిగిన వీడియోలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com