దివ్య మృతి కేసు.. నాగేంద్ర అరెస్ట్పై గోప్యత పాటిస్తున్న పోలీసులు

బెజవాడలో సంచలనం సృష్టించిన దివ్య మృతి కేసు నిందితుడు నాగేంద్ర ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. ప్రస్తుతం నిందితుడు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నాడు.. దీంతో అతడ్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలని బెజవాడ పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నదానిపై GGH సూపరింటెండెంట్తో మాట్లాడి.. ఆయన చెప్పినదాన్ని బట్టి నాగేంద్ర అరెస్ట్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పటికే దివ్య హత్య కేసు విచారణ పూర్తైంది. అలాగే పోలీసుల ఛార్జ్షీట్లో కీలక విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది.. దివ్యను హత్య చేసింది నాగేంద్రే అని నిర్ధారించారు.. ఫోరెన్సిక్ రిపోర్ట్లోని అంశాలే పోలీసుల విచారణలో కీలకమైంది. దివ్యను హత్య చేసింది నాగేంద్రే అని ఫోరెన్సిక్ నివేదికలో ఉంది. అలాగే దివ్య ఒంటిపై ఉన్న గాయాలు సొంతంగా చేసుకున్నావి కావని రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే నాగేంద్రను ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నదానిపై మాత్రం పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com