Chittoor: రామకుప్పంలో ఏనుగుల బీభత్సం

Chittoor: రామకుప్పంలో ఏనుగుల బీభత్సం
అర్థరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు.. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన బంగాళ దుంప పంటను నాశనం చేశాయి

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీఎం తండాలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. అర్థరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు.. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన బంగాళ దుంప పంటను నాశనం చేశాయి. పంటను ఇష్టమొచ్చినట్లు తొక్కిన ఏనుగులు.. కావాల్సినంత తిని వెళ్లి పోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఏనుగులు ధ్వంసం చేశాయని రైతు నణిక్య నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు చేసి వేసిన పంట ఏనుగుల పాలైందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఏనుగుల వల్ల లక్షల రూపాయలు నష్టపోయానని అధికారులు తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story