AP: కడుపులో కత్తెర మరిచిన ఏలూరు డాక్టర్లు

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వారం క్రితం కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్ చేసి.. కడుపులో కత్తెర వదిలేసిశారు వైద్యులు. అప్పటి నుంచి ఆమె కడుపునొప్పితో బాధపడుతోన్న మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఎక్స్రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం గుర్తించారు. అయితే.. ఎక్స్రే ఫొటోను ఓ ఉద్యోగి తన ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో షాక్ తిన్న ఆస్పత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆ పోస్టులను తొలగించాడు.
ఈ ఘటనను బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి వివరాలు కూడా మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. వైద్యుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు. మరోవైపు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com