ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్నారు : చంద్రబాబు అవేదన

ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్నారు : చంద్రబాబు అవేదన
బాధ్యతాయుత పౌరులుగా బాలబాలికలను... తీర్చిదిద్ది దేశ భవిష్యత్తును తరగతి గదుల్లో నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే..

బాధ్యతాయుత పౌరులుగా బాలబాలికలను... తీర్చిదిద్ది దేశ భవిష్యత్తును తరగతి గదుల్లో నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందుకే గురుబ్రహ్మగా పోల్చి, దైవ సమానులుగా ప్రవచించారంటూ... ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో నిబద్ధతత తమ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరికీ గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు అర్పించారు చంద్రబాబు. తెలుగుదేశంలో ఐదేళ్ల పాలనలో 5 వేల కోట్లతో పాఠశాలల్లో మౌలికవసతులు అభివృద్ధి చేశామన్నారు. డిజిటల్‌, వర్చువల్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. 2 డీఎస్సీలు నిర్వహించి 10 వేలకు పైగా టీచర్‌ పోస్టులు భర్తీచేశామని ట్వీట్ చేశారు. అయితే డీఎస్సీ-2018 అభ్యర్థుల ఎంపిక పూర్తై 9 నెలలు కావస్తున్నా... 3 వేల 633 మందిని ఈ ప్రభుత్వం ఇంకా నిరీక్షణలో ఉంచడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు.

ప్రస్తుతం నాడు-నేడు అనే కార్యక్రమం ఒక ఫార్స్‌గా మార్చడం శోచనీయమన్నారు చంద్రబాబు. ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోవడం అవేదన కలిగిస్తోందని ట్వీట్ చేశారు. ఇప్పుడీ కరోనా పరిస్థితుల్లో... మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని బాబు ఆకాంక్షించారు. మన సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేలా ముందు జాగ్రత్తల గురించి విద్యార్థులను... తద్వారా వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని కోరుతూ బాబు ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story