రాయదుర్గం టీడీపీ ఆఫీస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

రాయదుర్గం టీడీపీ ఆఫీస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత
X


అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ ఆఫీస్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా రాయదుర్గంలో ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలో రాయలసీమకు సాగునీరు అందించడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారంటూ ర్యాలీకి పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. దీంతో కాల్వ శ్రీనివాసులకు నోటీసులివ్వడానికి వెళ్లగా వాటిని ఆయన తీసుకోవడానికి నిరాకరించారు. అయితే కచ్చితంగా ర్యాలీ చేసి తీరుతామన్నారు కాల్వ శ్రీనివాసులు. టీడీపీ ఆఫీస్‌ వద్ద కాల్వ శ్రీనివాసుల్ని అడ్డుకున్నారు.

పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత ఏర్పడింది. రాయలసీమకు 32 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న జగన్.. 3 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదంటూ మండిపడ్డారు కాల్వ శ్రీనివాసులు. నది జలాలు తరలించకుండా రాయలసీమ ప్రాంతాలకు సీఎం ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి, సాగు నీరందించడానికి చర్యలు తీసుకోకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు.

Tags

Next Story