CBN: ధాన్యం గింజలతో చంద్రబాబు చిత్రం

CBN: ధాన్యం గింజలతో చంద్రబాబు చిత్రం
X
చంద్రబాబుకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు

తూ­ర్పు­గో­దా­వ­రి జి­ల్లా కడి­యం మం­డ­లం కడి­యం­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు పు­ట్టి­న­రో­జు సందర్భంగా ధా­న్య­పు గిం­జ­ల­తో చం­ద్ర­బా­బు చి­త్ర­ప­టా­న్ని రూ­పొం­దిం­చా­రు. దీ­ని­ని పలు­వు­రు మం­త్రు­లు తిలకించారు. చం­ద్ర­బా­బు రా­ష్ట్ర అభి­వృ­ద్ధి ప్ర­దా­త­గా మా­రా­ర­ని, అం­దు­కు ని­ద­ర్శ­న­మే ఆయన ఇటీ­వల రా­ష్ట్రా­ని­కి తీ­సు­కు­వ­చ్చిన ఐటీ, ఇతర పరి­శ్ర­మ­లు అని మం­త్రు­లు కం­దుల దు­ర్గే­శ్‌, గొ­ట్టి­పా­టి రవి, గ్రా­మీణ ఎమ్మె­ల్యే గో­రం­ట్ల బు­చ్చ­య్య చౌ­ద­రి కొ­ని­యా­డా­రు.

ఆమె సహకారం, ఆప్యాయత వల్లే

ఏపీ సీఎం చం­ద్ర­బా­బు తన పు­ట్టిన రోజు సం­ద­ర్భం­గా సతీ­మ­ణి భు­వ­నే­శ్వ­రి­తో కలి­సి కే­క్‌ కట్‌ చే­శా­రు. ‘‘జీ­వి­తం­లో మరో ఏడా­ది పూ­ర్తి చే­సు­కుం­టు­న్న వేళ.. ఎప్ప­టి­కీ అం­డ­గా ని­లి­చే జీ­విత భా­గ­స్వా­మి­తో కలి­సి నా ప్ర­యా­ణా­న్ని గు­ర్తు చే­సు­కుం­టు­న్నా. ఆమె సహ­కా­రం, ఆప్యా­యత వల్లే జీ­వి­తం మరింత అర్థ­వం­తం­గా మా­రు­తోం­ది’’ అని చం­ద్ర­బా­బు ‘ఎక్స్‌’లో పో­స్టు పె­ట్టా­రు. ఇది వైరల్ గా మారింది. మరో­వై­పు ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­కు ప్ర­ధా­ని మోదీ జన్మ­దిన శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. ‘‘కష్ట­ప­డి పని­చే­సే ఏపీ సీఎం, ఆప్త­మి­త్రు­డు చం­ద్ర­బా­బు­కు పు­ట్టిన రోజు శు­భా­కాం­క్ష­లు. ఆయన నా­య­క­త్వం­లో ఏపీ అన్ని రం­గా­ల్లో­నూ సరి­కొ­త్త శి­ఖ­రా­ల­ను అధి­రో­హి­స్తోం­ది. ఆయ­న­కు దీ­ర్ఘా­యు­ష్షు, సం­పూ­ర్ణ ఆరో­గ్యం లభిం­చా­ల­ని ఆకాం­క్షి­స్తు­న్నా­ను’’ అని ప్ర­ధా­ని మోదీ ‘ఎక్స్‌’ వే­ది­క­గా పో­స్టు పె­ట్టా­రు.

తమిళనాడు అభివృద్ధి ఎన్డీయేతోనే: చంద్రబాబు

ఎన్టీఆర్, ఎంజీఆర్ లు చాలా దగ్గరి స్నేహితులని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారిద్దరూ కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం నిర్వహించారు. "ఇప్పటికీ చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో తమిళమే మాట్లాడతారు. నా వివాహం కూడా చెన్నైలోనే జరిగింది. నదుల అనుసంధానంతో దేశానికి నీటి భద్రత వస్తుంది. భవిష్యత్తులో అన్నీ కుదిరితే గోదావరి - కృష్ణ- కావేరి నదులు అనుసంధానం కావాలి. ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. తమిళుల ప్రయోజనాలు పట్టని పార్టీలు మనకొద్దు. తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునేది.. ఎన్డీయే మాత్రమే" అని చంద్రబాబు అన్నారు.

Tags

Next Story