రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

రాజధాని ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. యర్రబాలెంలో రైతు గడ్డం వెంకటేశ్వర్రావు ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని కోసం 4.25 ఎకరాలు భూమిని ఇచ్చారు. ఐతే.. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల మాట ఎత్తుకోవడంతో తమ భవిష్యత్ ఏమవుతుందోనని కొన్నాళ్లుగా ఆయన ఆందోళనలో ఉన్నారు. రాజధాని మార్పు, తన ప్లాట్ ఇంకా రాని విషయం ఆయనపై ఒత్తిడి పెంచింది. దీంతో.. మనస్తాపానికి గురైన ఆయన ఆ ఒత్తిడితో మరణించారని గ్రామస్థులు అంటున్నారు.


Tags

Next Story