SAD: అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య

SAD: అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య
X
కడప జిల్లాలో తీవ్ర విషాదం... స్థానికంగా విషాద చాయలు

కడప జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ రైతు... భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులకు ఉరి వేసి తాను ప్రాణాలు తీసుకున్నాడు. సింహాద్రిపురం మండలం దిద్దేకుంటకు చెందిన రైతు కొమెర నాగేంద్ర, వాణి భార్యాభర్తలు.. వీరు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ దంపతులకు కుమారుడు భార్గవ్, కుమార్తె గాయత్రి ఉన్నారు. నాగేంద్ర ఎకరన్నర పొలంలో ఐదేళ్లుగా చీనీ సాగు చేస్తుండగా.. మరో 15 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని ఎనిమిదేళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. నాగేంద్ర పొలంలో పంటల సాగుకు సంబంధించి పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. నాలుగేళ్లుగా ఎంత కష్టపడినా సరైన దిగుబడులు రాకపోవడంతో నష్టాల పాలయ్యారు.. దీంతో అప్పులు కూడా ఎక్కువ కావడంతో ఒత్తిడితో ఉన్నారు. గతేడాది ఓ ట్రాక్టరును కొనుగోలు చేసి ప్రతి నెలా ఈఎంఐ కడుతున్నారు నాగేంద్ర. ఇలా మొత్తం 20 లక్షల వరకు అప్పులు కావడం.. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో నాగేంద్రకు ఏం చేయాలో తెలియలేదు. ఈ ఏడాది కూడా 13 ఎకరాల్లో కొర్ర పంటను సాగు చేయగా.. మళ్లీ దిగుబడి సరిగా లేకపోవడంతో నిరాశ తప్పలేదు. అప్పుల బాధ పెరగడంతో నాగేంద్ర మనస్తాపానికి గురయ్యారు.

అంతా అనుకునే ఆత్మహత్య

శుక్రవారం దంపతులిదద్దరు ముద్దనూరు వెళ్లి ఓ షాపులో తాడు కొనుగోలు చేశారు. సాయంత్రానికి ఇంటికి వచ్చి.. స్కూల్ నుంచి వచ్చిన ఇద్దరు పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం రాత్రి దంపతులిద్దరు వారి చీనీ తోటకు వెళ్లారు.. ముందు భార్యను ఇనుప గేటుకు తాడుతో ఉరేసి చంపారు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఉరి వేయడంతో చనిపోయారు.. అనంతరం నాగేంద్ర కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నాగేంద్ర తల్లి ఇంటికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించలేదు.. ఆ వెంనటే బంధులకు చెప్పగా.. వారు నాగేంద్ర మొబైల్‌కు కాల్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఇంతలో స్థానికులు నాగేంద్రం పొలం వైపు వెళ్లడం చూశామని చెప్పడంతో.. అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ అందరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags

Next Story