దారుణం.. తండ్రీకొడుకుల్ని స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామపెద్దలు
కృష్ణా జిల్లా నూజివీడు మండలం దేవరగుంటలో దారుణం జరిగింది. బాకీ డబ్బుల వసూలు కోసం తండ్రీకొడుకులపై గ్రామపెద్దలు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు.. అతని కుమారుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. గ్రామంలోని ఓ వ్యక్తి నుంచి వెంకటేశ్వరరావు 15 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వెంకటేశ్వరరావు తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్లు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు వడ్డీతో కలిపి 20 లక్షల రూపాయలు చెల్లించాలని గ్రామపెద్దలు తీర్పు ఇచ్చారు. అయితే... తీర్పులో విధించిన గడువు ముగిసినా అప్పు తీర్చలేదని గ్రామపెద్దలు స్తంభానికి కట్టేసి కొట్టారు. విషయం తెలుసుకుని గ్రామానికి వచ్చిన పోలీసులు.. వెంకటేశ్వరరావును విడిపించారు. బాకీదారులకు ప్రాంసరీ నోట్లు రాయించి ఇచ్చి.. వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com