శ్రీకాలహస్తి కైలాసగిరిలో అగ్నిప్రమాదం..అగ్నికి ఆహుతైన వృక్షసంపద

X
By - Subba Reddy |13 April 2023 7:45 AM IST
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలో ఉన్న కైలసరిగిలో భారీగా మంటలు చెలరేగాయి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలో ఉన్న కైలాసగిరిలో భారీగా మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో... వృక్ష సంపద అగ్నికి ఆహుతైంది. మంటలు ఆలయానికి సంబంధించిన గోశాల వరకు చేరాయి. గోశాలలో దాదాపు 700ల ఆవులు ఉండటంతో ఆందోళన వ్యక్తమైంది. మంటలు వ్యాప్తి చెందడంతో.. శ్రీ సిటీ, నాయుడుపేట, వెంకటగిరి, నుంచి ఫైర్ ఇంజిన్లు తెప్పించారు. దాదాపు ఐదు గంటలకుపైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com