శ్రీశైలం రిజర్వాయర్కు మళ్లీ వరద ప్రవాహం

శ్రీశైలం రిజర్వాయర్కు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే అధికారులు 7 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తివేయడం ఏడోసారి కావడం విశేషం. ప్రస్తుతం రిజర్వాయర్కు రెండు లక్షల క్యూసెక్కులకుపైగానే ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.90 అడుగుల మేర నీరుంది. 215 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలశయానికి లక్ష 95 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం, ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు 4 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి 60 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని స్పిల్ వే ద్వారా దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.4 టీఎంసీల నీరుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com