Ganja In Amazon: గంజాయి అమ్మకానికి అమెజానే వేదిక.. ఆ ముఠాకు కోట్లలో ఆదాయం..

Ganja In Amazon: గంజాయి అమ్మకానికి అమెజానే వేదిక.. ఆ ముఠాకు కోట్లలో ఆదాయం..
Ganja In Amazon: గంజాయి ముఠా ఇప్పుడు కొత్తదారులు వెతుక్కోంటుంది.

Ganja In Amazon: గంజాయి ముఠా ఇప్పుడు కొత్తదారులు వెతుక్కోంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గట్టి నిఘా పెట్టడంతో.. ఇప్పుడు ఈ-కామర్స్‌ ద్వారా సరఫరాకు పాల్పడుతోంది. 8 నెలల్లో అమెజాన్‌ ద్వారా 725 సార్ల గంజాయి పార్సిళ్లు వెళ్లాయంటే.. దందా ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. విశాఖ మన్యం నుంచి మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు అమెజాన్‌ ద్వారా గంజాయి పార్సిళ్లు వెళ్లినట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దర్యాప్తులో తేలింది.

ఒక్కో పార్సిల్‌లో రెండేసి కిలోలు చొప్పున మొత్తం వెయ్యి 450 కిలోలు తరలినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు 12 మధ్య 1.45 కోట్ల రూపాయలు విలువైన గంజాయి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. బాబు టెక్స్‌ సంస్థ పేరుతో 364 సార్లు, మరో ఆరు సంస్థల పేర్లతో 361 సార్లు గంజాయి పార్సిళ్లు వెళ్లినట్లు ఎస్‌ఈబీ అధికారులు నిర్ధారించారు.

సూపర్‌ నేచురల్‌ స్టీవియా లీవ్స్‌ సరఫరా ముసుగులో గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు వెల్లడయ్యింది. ఇదే తరహాలో ఇంకా ఏవైనా ముఠాలు ఈ-కామర్స్‌ వేదికలను వినియోగించి స్మగ్లింగ్‌ చేస్తున్నాయా? అనే కోణంలో ఎస్‌ఈబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఠా సూత్రధారులు మధ్యప్రదేశ్‌కు చెందిన ముకుల్‌ జైస్వాల్‌, సూరజ్‌ పవయగా గుర్తించారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థల జీఎస్టీ నంబర్లు సేకరించి.. వాటి చిరునామా మార్చేసి అమెజాన్‌ ద్వారా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. ఆయుర్వేద ఉత్పత్తులు, సూపర్‌ నేచురల్‌ స్టీవియా లీవ్స్‌ పేరుతో దందాకు పాల్పడుతున్నారు. ఒకవేళ నిజంగా ఆయుర్వేద ప్రొడక్ట్‌లు కావాల్సినవారు అందులో ఆర్డర్లు పెడితే.. నో స్టాక్‌ అని చూపించేలా ఏర్పాటు చేసుకుని.. కేవలం స్మగ్లర్లు పెట్టినప్పుడు మాత్రమే ఆర్డరు వచ్చేలా హైటెక్‌ టెక్నాలజీలో దందా పాల్పడుతున్నట్లు ఎస్‌ఈబీ గుర్తించింది.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని విశాఖ మన్యం కేంద్రంగా సాగవుతున్న గంజాయి స్మగ్లింగ్‌లో దాదాపు 648 మంది స్మగ్లర్లు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల వారే. కొన్నేళ్ల కిందట వరకూ విశాఖ మన్యంలో వందల ఎకరాల్లోనే గంజాయి సాగయ్యేది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ముఠాలు వచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేయించటం మొదలుపెట్టాక గత పదేళ్లలో అది విస్తృతమైంది.

విశాఖ మన్యం నుంచి దేశ, విదేశాలకు తరలింపు ఎక్కువైంది. ఈ పదేళ్లలో పోలీసులు నమోదుచేసిన కేసుల్లో 16 రాష్ట్రాలకు చెందిన 5 వేల 254 మంది స్మగ్లర్లు నిందితులుగా తేలారు. గత కొన్నాళ్లుగా వీరిలో 4 వేల 606 మందిని ఇప్పటివరకూ అరెస్టుచేశారు.

ఇతర రాష్ట్రాల స్మగ్లర్లలో పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న వారు 648 మంది వరకూ ఉన్నారని ఎస్‌ఈబీ గుర్తించింది. విశాఖలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారుల ప్రాంతీయ సదస్సులో.. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులకు పట్టుకోవాల్సిన స్మగ్లర్ల జాబితాను ఏపీ

Tags

Read MoreRead Less
Next Story