గోడౌన్లో భారీ పేలుడు.. 50 అడుగుల దూరంలో ఎగిరిపడ్డ మృతదేహాలు
By - Nagesh Swarna |3 Sep 2020 10:41 AM GMT
స్క్రాప్ గోడౌన్లో భారీ పేలుడు జరిగింది. పేలుడు తీవ్రతకు గోడౌన్ నుంచి 50 అడుగుల దూరంలో మృతదేహాలు ఎగిరిపడ్డాయి.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి స్క్రాప్ గోడౌన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పేలుడు తీవ్రతకు గోడౌన్ నుంచి 50 అడుగుల దూరంలో మృతదేహాలు ఎగిరిపడ్డాయి. స్క్రాప్ కొనుగోలు చేసేందుకు తండ్రీకొడుకులు అక్కడికి వెళ్లినట్టు గుర్తించారు. మృతులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com