Eluru: పొలంలో దొరికిన 18 బంగారు నాణేలు.. .
By - Prasanna |3 Dec 2022 9:18 AM GMT
Eluru: పొలంలో పైప్ లైన్ వేస్తుండగా రైతుకు బంగారు నాణేలు దొరికాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో చోటు చేసుకుంది
Eluru: పొలంలో పైప్ లైన్ వేస్తుండగా రైతుకు బంగారు నాణేలు దొరికాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంకు చెందిన తేజశ్రీకి చెందిన పొలంలో పైపులైన్ వేసేందుకు తవ్వకాలు జరిపారు. అయితే ఆ సమయంలో పొలంలోని ఓ ప్రాంతంలో బంగారు నాణేలు కనిపించాయి.
దీంతో రైతు మరింత లోతుగా తవ్వగా మట్టి పిడతలో సుమారు 18 బంగారు నాణేలు లభించాయి.. ఒక్కొక్క బంగారు నాణెం సుమారు మూడు గ్రాముల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. బంగారు నాణేలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు.. తేజశ్రీ. కొయ్యలగూడెం ఎమ్మార్వో నాగమణి రైతు పొలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం బంగారు నాణేలను ట్రెజరీకి అప్పగించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com