G.O.No. 1: కొనసాగుతున్న విచారణ...!
By - Subba Reddy |24 Jan 2023 7:15 AM GMT
తీర్పు ఎలా ఉండబోతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
జీవో నెంబర్ వన్పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. సోమవారం రామకృష్ణ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ పై ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించగా.. రామకృష్ణ తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజూ రామచంద్రన్ వాదనలు వినిపించారు.
నేడు (మంగళవారం) మరోమారు వాదనలు వినిపించనున్నారు. ఇక జీవో నెంబర్ వన్ పై టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కూడా పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్లపై కూడా నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక జీవో నెంబర్ వన్ పై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com