ఏపీలో ఇసుక మాఫియాపై బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు

X
By - Nagesh Swarna |13 Nov 2020 1:26 PM IST
జగన్ కన్నుసన్నల్లోనే.. మైనింగ్ మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటోందని.. టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇసుక విధానంలో క్విడ్ ప్రోకో కంటే అనేక రెట్లు దోపిడీకి తెరలేపారని అన్నారు. రేవుల్లో నేరుగా తీసుకునే టన్ను ఇసుక ధరను 50 నుంచి 375 చేసి.. తాజాగా 525కి పెంచారన్నారు. ఇంతగా ధర పెరిగాక.. ఇసుకపై 17 నెలల్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. వరదలు తగ్గాక ఇసుక అందుబాటులో ఉన్నా.. సామాన్యుడికి దక్కని పరిస్థితి నెలకొందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com