GST: ఆంధ్రప్రదేశ్ పైకి... తెలంగాణ కిందకు

కేంద్ర ప్రభుత్వం శ్లాబులు తగ్గించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జీఎస్టీ వసూల్లు పెరగగా.. తెలంగాణలో మాత్రం తగ్గాయి. సెప్టెంబరు నెల ద్వితీయార్ధంలో దేశవ్యాప్తంగా పన్నుల వసూళ్లు జోరందుకున్నాయి. ఏపీలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే 4 శాతం మేరకు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబరులో రూ.3,506 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ప్రస్తుతం రూ.3,653 కోట్లకు చేరింది. తెలంగాణలో మాత్రం జీఎస్టీ వసూళ్లు 5 శాతం తగ్గాయి. గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణలో రూ.5,267 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది రూ.4,998 కోట్లు మాత్రమే వచ్చాయి. సెప్టెంబర్ నాటిజికి జీఎస్టీ వసూళ్లు 9 శాతానికి పెరిగి.. 1.89 లక్షల కోట్లను వసూళ్లు చేశాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇటీవల తగ్గించిన పన్ను రేట్లు కూడా సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2024 సెప్టెంబర్లో జిఎస్టి వసూళ్లు 1.73 లక్షల కోట్లు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జిఎస్టి వసూళ్లు ఈ ఏడాది 9.1 శాతం ఎక్కువగా వసూళ్లయ్యాయి. ఇక గత నెలతో పోలిస్తే 1.5 శాతం ఎక్కువ అని ప్రభుత్వ డేటా స్పష్టం చేసింది. సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టి 2.0 పన్ను రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో స్థూల దేశీయ ఆదాయం 6.8 శాతం పెరిగి 1.36 లక్షల కోట్లకు చేరుకుంది. దిగుమతులపై పన్ను సెప్టెంబర్లో 15.6 శాతం పెరిగి.. 52,492 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ 2025 నికర జిఎస్టి ఆదాయం 1.60 లక్షల కోట్లుగా ఉంది. ఇది సంవత్సరానికి 5 శాతం వృద్ధిని నమోదు చేసింది.
దేశంలో జీఎస్టీ-2.0 సంస్కరణలు గత నెల 22 నుంచి అమలులోకి వచ్చాయి. ఫలితంగా 375 నిత్యావసర వస్తువులు సహా వస్తు సేవలు, ఆటోమొబైల్స్, గృహోపకరణాల వస్తువుల ధరలు దిగి వచ్చాయి. ఫలితంగా వాటికి డిమాండ్ పెరిగి విక్రయాలు పుంజుకున్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు.
గత నెలలో ఇలా...
గత నెలలో స్థూల జాతీయాదాయం 6.8 శాతం మేరకు పెరిగి రూ.1.36 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు దిగుమతుల ద్వారా పన్ను రాబడి కూడా 15.6ు వృద్ధి చెంది.. రూ.52,492 కోట్లుగా నమోదైంది. ఇక, జీఎస్టీ రిఫండ్లు కూడా 40.1ు మేరకు పెరిగి రూ.28,657 కోట్లుగా నమోదయ్యాయి. నికరంగా జీఎస్టీ వసూలు రూ.1.60 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే ఇది 5ు అధికమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాలపై డెలాయిట్ పార్టనర్ ఎం.ఎస్. మణి స్పందిస్తూ.. జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించలేదనడానికి ఈ వసూళ్లు నిదర్శనమని తెలిపారు. సెప్టెంబరు వసూళ్లతో ఈ ఏడాది ఇప్పటివరకు సగటు పన్నుల రాబడి రూ.2 లక్షల కోట్లకు చేరువలో ఉన్నట్టు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com