ఆందోళనకరంగా ఎంపీ అవినాష్ తల్లి ఆరోగ్యం
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఆమెకు నాన్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉందని పేర్కొన్నారు. ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఎంపీ అవినాష్ తల్లిని వైద్యుల బృందం పర్యవేక్షణలో CCUలో ఉంచారు. అయితే ఆమె రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉండటంతో వైద్యులు అయానోట్రోపిక్ సపోర్ట్లో ఉంచారు.
ప్రస్తుతం ఆమెకు వాంతులు అవుతున్నాయని ఇలాగే వాంతులు కొనసాగితే అల్ట్రాసౌండ్, అలాగే మెదడుకు సంబంధించిన పరీక్షలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బీపీ తక్కువగా ఉన్నందున ఆమెను మరికొన్ని రోజులు ఐసియులో ఉంచాల్సి వస్తుందని వైద్యుల బృందం ప్రకటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com