SRISAILAM: కృష్ణమ్మ పరుగులు.. సాగర్, శ్రీశైలం గేట్లు ఎత్తివేత

SRISAILAM: కృష్ణమ్మ పరుగులు.. సాగర్, శ్రీశైలం గేట్లు ఎత్తివేత
X
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి పోటెత్తిన వరద

కృష్ణా నది ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువన ఉన్న కర్ణాటకలోని పలు జిల్లాలో మూడు రోజుల నుంచి విస్తారంగా వానలు పడడంతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 4 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,900 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,139 మొత్తం 68,039 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తు తం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సాగర్‌ గేట్లు కూడా...

శ్రీశైలం గేట్లను ఎత్తడం, సాగర్ అటవీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండి.. గేట్ల నుంచి నీరు దూకుతోంది. దీంతో శనివారం రాత్రి 18 గేట్లను ఎత్తిన అధికారులు.. శ్రీశైలం నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండంటతో పులిచింత ప్రాజెక్టు కూడా నిండిపోయింది. దీంతో ఇవాళ తెల్లవారుజామున 7 గేట్లను ఎత్తిన అధికారులు లక్షా 72 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా బ్యారేజీకి భారీగా వరద చేరుకుంటుంది. జూరాల నుంచి 1,18,464 క్యూసెక్కులు, సుకేసుల నుంచి 72,114 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 వరద వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 213.8824 టీఎంసీలుగా నమోదైంది.

పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్‌ఎన్‌ ఎస్‌ఎస్‌కు 1,561, రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శనివారం అధికారులు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 16 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లను ఐదడుగులు పైకి ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,29,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం 590 అడుగుల గరిష్ట నీటిమట్టంతో ఉంది. ప్రస్తుతం సాగర్‌ జలాశయానికి 1,74,120 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రధాన విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 29,435 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల నుంచి 1,29,600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ లకు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు 15,085 క్యూసె క్కుల నీరు వదులుతున్నారు. మొత్తం సాగర్‌ నుంచి 1,74,120 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

Tags

Next Story