HIDMA: హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

HIDMA: హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
X

అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు జి­ల్లా మా­రే­డు­మి­ల్లి సమీ­పం­లో­ని జి­య­మ్మ­వ­ల­స­లో జరి­గిన ఎదు­రు­కా­ల్పు­ల్లో మా­వో­యి­స్టు అగ్ర­నేత మడ్వి హి­డ్మా­తో పాటు, అతడి భా­ర్య మడ­కా­మ్ రాజే, దేవే, లక్మ­ల్, మల్లా, కమ్లు మృతి చెం­దిన వి­ష­యం తె­లి­సిం­దే. అయి­తే, ఆ ఆరు­గు­రి మృ­త­దే­హా­ల­కు రం­ప­చో­డ­వ­రం ప్ర­భు­త్వ ఆస్ప­త్రి వద్ద భద్ర­తా బల­గాల బం­దో­బ­స్తు నడుమ 8 మంది వై­ద్యుల బృం­దం పో­స్టు­మా­ర్టం ని­ర్వ­హిం­చిం­ది. అక్క­డి­కి హి­డ్మా తల్లి­తో పాటు సో­ద­రు­డు, పు­వ్వ­ర్తి గ్రామ సర్పం­చ్ వె­ళ్లా­రు. పో­స్టు­మా­ర్టం పూ­ర్త­యిన వెం­ట­నే వారి మృ­త­దే­హా­ల­ను కు­టుంబ సభ్యు­ల­కు అప్ప­గిం­చా­రు. ఈ క్ర­మం­లో­నే రం­ప­చో­వ­రం ప్ర­భు­త్వ ఆస్ప­త్రి పరి­స­రా­ల్లో రో­ద­న­లు ఒక్క­సా­రి­గా మి­న్నం­టా­యి. అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు జి­ల్లా­లో­ని మా­రే­డు­మి­ల్లి­లో బు­ధ­వా­రం ఉదయం మరో ఎన్‌­కౌం­ట­ర్‌ జరి­గిం­ది. ఈ ఘట­న­లో మరో ఏడు­గు­రు మా­వో­యి­స్టు­లు మృతి చెం­దా­రు. వీ­రి­లో ఆం­ధ్రా- ఒడి­శా బో­ర్డ­ర్‌ (ఏవో­బీ) కమి­టీ నేత మె­ట్టూ­రి జో­గా­రా­వు అలి­యా­స్‌ టె­క్‌ శం­క­ర్‌ అలి­యా­స్‌ బాబు అలి­యా­స్‌ శి­వ­తో­పా­టు మరో ఆరు­గు­రు ఉన్నా­రు.

లొంగిపోయేందుకు హిడ్మా ప్రయత్నం

మావో అగ్ర­నేత హి­డ్మా మృతి తర్వాత ఆస­క్తి­కర వి­ష­యా­లు వె­లు­గు­లో­కి వస్తు­న్నా­యి. హి­డ్మా కొ­న్ని రో­జు­లు­గా లొం­గి­పో­యే ప్ర­య­త్నం చే­సి­న­ట్లు తె­లి­సిం­ది. ఈ మే­ర­కు తన ఆలో­చ­న­లు, ని­ర్ణ­యా­ల­పై బస్త­ర్‌­లో ఉన్న ఒక జర్న­లి­స్ట్‌­కు హి­డ్మా లేఖ రా­శా­రు. తన చి­వ­రి లే­ఖ­లో ఆయు­ధా­లు వి­డి­చేం­దు­కు ఆలో­చి­స్తు­న్న­ట్టు పే­ర్కొ­న్నా­డు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు రా­వా­ల­ని నవం­బ­ర్ 10న జర్న­లి­స్ట్‌­కు రా­సిన లే­ఖ­లో పే­ర్కొ­న్నా­డు. “ఎక్కడ లొం­గి­పో­వా­ల­న్న­ది ని­ర్ణ­యిం­చా­ల్సి ఉంది.. మా భద్ర­త­కు హామీ ఇస్తే లొం­గి­పో­యేం­దు­కు సి­ద్ధం.. త్వ­ర­లో హిం­దీ­తో పాటు తె­లు­గు­లో­నూ ఆడి­యో మె­సే­జ్ పం­పు­తాం.. ఆయు­ధా­లు వి­డి­చే ముం­దు కొ­న్ని అం­శాల పై చర్చిం­చా­ల్సి ఉంది..” అని లే­ఖ­లో రా­సు­కొ­చ్చా­డు. ఇలా లేఖ రాసి లొం­గు­బా­టు గు­రిం­చి చర్చ­లు జరు­పు­తుం­డ­గా­నే హి­డ్మా­తో పాటు ఆయన భా­ర్య రాజీ మర­ణిం­చా­రు.

మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం

దం­డ­కా­ర­ణ్యం­లో మరో­సా­రి రక్తం ఏరు­లై­పా­రిం­ది. హి­డ్మా­ను మట్టు­బె­ట్టిన 24 గం­ట­ల్లో­పే మరో మా­వో­యి­స్టు అగ్ర­నేత హత­మ­య్యా­డు. అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు జి­ల్లా మా­రే­డు­మి­ల్లి సమీ­పం­లో జి­య­మ్మ వల­స­లో బు­ధ­వా­రం ఉదయం 6.30-7 గంటల సమ­యం­లో పో­లీ­సు­లు- మా­వో­యి­స్టుల మధ్య జరి­గిన ఎదు­రు­కా­ల్పు­ల్లో ఏడు­గు­రు మా­వో­యి­స్టు­లు మృతి చెం­దా­రు. మృ­తు­ల్లో మా­వో­యి­స్ట్ పా­ర్టీ అగ్ర­నేత అలి­యా­స్ మె­ట్టూ­రి జో­గా­రా­వు అలి­యా­స్ టెక్ శం­క­ర్ తో పాటు.. నం­బాల కే­శ­వ­రా­వు గా­ర్డ్ కమాం­డ­ర్ జ్యో­తి అలి­యా­స్ సరిత, ఏసీ­ఎం­లు సు­రే­ష్ అలి­యా­స్ రమే­ష్, లో­కే­ష్ అలి­యా­స్ గణే­ష్, సా­యి­ను అలి­యా­స్ వాసు, అనిత, షమ్మి­లు ఉన్న­ట్లు పో­లీ­సు­లు తె­లి­పా­రు. మృ­తు­ల్లో నలు­గు­రు పు­రు­షు­లు, ము­గ్గు­రు మహి­ళ­లు ఉన్న­ట్లు స్ప­ష్టం చే­శా­రు. వీ­రం­తా ఛత్తీ­స్‌­గ­ఢ్‌­కు చెం­ది­న­వా­రి­గా తె­లు­స్తోం­ది. మృ­తు­ల­ను మా­వో­యి­స్టు­లు జో­గా­రా­వు అలి­యా­స్‌ టె­క్‌ శం­క­ర్‌, సీత అలి­యా­స్‌ జ్యో­తి, సు­రే­శ్‌, గణే­శ్‌, వాసు, అనిత, షమ్మి­గా గు­ర్తిం­చా­రు. మరో­వై­పు మా­రే­డు­మి­ల్లి అటవీ ప్రాం­తం­లో భద్ర­తా బల­గాల కూం­బిం­గ్‌ కొ­న­సా­గు­తోం­ది. మృ­త­దే­హా­ల­ను రం­ప­చో­డ­వ­రం ఏరి­యా ఆస్ప­త్రి­కి తర­లిం­చా­రు.

Tags

Next Story