Prakasham: యర్రగొండపాలెంలో హైటెన్షన్

Prakasham: యర్రగొండపాలెంలో హైటెన్షన్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హైటెన్షన్ నెలకొంది. రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇజ్రాయిల్‌పేటలో ఒక అర్చీ నిర్మాణంపై ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. చివరికి అదికాస్త కొట్టుకునేవరకు వెళ్లింది. యువకులు, మహిళలు పరస్పరం గొడవకు దిగారు. ఇరువర్గాల ఘర్షణతో యర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. మారుతీకృష్ణ, కానిస్టేబుల్ హిదాయతుల్లాతో సహా పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. సబ్ కలెక్టర్ నేతృత్వంలోని ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం యర్రగొండపాలెంలో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత 144 సెక్షన్ విధించారు పోలీసులు. అటు స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్‌పై గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడి ఉంటే పరిస్థితి దాడుల వరకు వెళ్లేది కాదని స్థానికులు అంటున్నారు

Next Story