కొడుకులు రాలేదని ఇంట్లోనే దహనం

X
By - Subba Reddy |29 May 2023 4:00 PM IST
కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. తండ్రి దహన సంస్కారాలకు కుమారులు రాలేదు
కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. తండ్రి దహన సంస్కారాలకు కుమారులు రాలేదు. తల్లి లలిత సమాచారం అందించిన తాము రావడానికి ఇప్పుడు కుదరదని కుమారులు చెప్పినట్లు సమాచారం. ఇద్దరు కుమారులు అమెరికాలో ఉంటున్నట్లు తెలియజేసింది తల్లి. కుమారులు రాకపోవడంతో భర్త హరప్రసాద్ శవాన్ని ఇంటి ఆవరణలోనే దహనం చేసింది భార్య. అయితే ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com