ఏపీలో కొనసాగుతున్న దేవాలయాలపై దాడులు.. శివాలయంలోని నవగ్రహాలయంలో విగ్రహం ధ్వంసం

X
By - Nagesh Swarna |4 Jan 2021 5:30 PM IST
కృష్ణా జిల్లా ఉయ్యూరు శివాలయంలో ఘటన చోటుచేసుకుంది. శివాలయంలోని నవగ్రహాల ఆలయంలో.. కేతువు విగ్రహం చెయ్యి విరిగింది.
భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు, విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కృష్ణా జిల్లా ఉయ్యూరు శివాలయంలో మరో ఘటన చోటుచేసుకుంది. శివాలయంలోని నవగ్రహాల ఆలయంలో.. కేతువు విగ్రహం చెయ్యి విరిగింది. ఈ ఘటన 2 నెలల క్రితం జరిగిందని అర్చకులు అంటున్నారు. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు గోప్యంగా ఉంచి.. దర్శనాలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. కేతువు విగ్రహ స్థానంలో మరో విగ్రహాన్ని తెనాలిలో తయారు చేయిస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు.. ఈ నెల 8న విగ్రహ పునఃప్రతిష్టకు రహస్య ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉయ్యూరు సీఐ నాగప్రసాద్, ఎస్సై షబ్బీర్ అహ్మద్లు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకుని బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com