Indian Student dead: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించాడు. వాటర్ఫాల్స్ చూసేందుకు వెళ్లి అందులో పడిపోయి సూర్య అవినాశ్ ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన గద్దె శ్రీనివాసరావు కుమారుడు సూర్య అవినాశ్ స్థానికంగా శశి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. న్యూజెర్సీలో ఉంటూ ఎంఎస్ చదువుతున్న సూర్య అవినాశ్ సోమవారం ఉదయం తన స్నేహితులతో కలిసి వాటర్ఫాల్స్ చూసేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారడంతో అందులోనే పడిపోయి మృతి చెందాడు. సూర్య అవినాశ్ మరణవార్త తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అవినాశ్ మృతితో అతని స్వగ్రామం చిట్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు నెలల క్రితం కూడా ఇదే గ్రామానికి చెందిన మరో విద్యార్థి అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చిట్యాల గ్రామస్తులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కాగా, అవినాశ్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తానా అధ్యక్షుడు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com